Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

MIDHANI Jobs Recruitment : మిశ్రా ధాతు నిగమ్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 2,20,000 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే, వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న  మినీ రత్న -1 కంపెనీ కు చెందిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

MIDHANI Jobs Recruitment
ముఖ్యంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

2). ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ, అవసరాన్ని బట్టి పరీక్షల నిర్వహణ ఉంటుంది.

3). భారీ స్థాయిలో జీతభత్యాలు.

మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. MIDHANI Jobs Recruitment

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది.

మిధాని, హైదరాబాద్ లో భర్తీ చేయబోయే ఈ పోస్టుల విధి -విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :    నవంబర్ 24, 2021.

విభాగాల వారీగా ఖాళీలు   :

అసిస్టెంట్ మేనేజర్స్ ( F & A )            -      2

మేనేజర్స్ ( F & A )                               -      4

డిప్యూటీ జనరల్ మేనేజర్ ( F & A )    -      1

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 7 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

ICWA /CA అసోసియేట్ మెంబెర్ గా ఉండవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

30 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగుల అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం   :

పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఆవశ్యకత ను బట్టి వ్రాత పరీక్షలను నిర్వహించే అవకాశం కలదని ఈ ప్రకటనలో తెలిపారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  40,000 రూపాయలు నుండి 2,20,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

ఈ జీతంతో పాటు డీఏ +హెచ్. ఆర్. ఏ +ఈపీఎఫ్ + గ్రాట్యుటీ తదితర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website

Notification  

Post a Comment

0 Comments