ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 1000 కు పైగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీనకు వెలువడనున్న నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన వార్త.
ఏపీపీఎస్సీ చైర్మన్ కు సభ్యుడు వ్రాసిన ఈ లేఖలో అభ్యర్థుల వయస్సు పరిమితిను పెంచవలసిన అవసరం ఏమిటో వివరించడం జరిగింది.
లేఖలో చైర్మన్ దృష్టికు తెలిపిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏపీ లో 2011,2016,2018 మరియు 2022 సంవత్సరాలలో 651 గ్రూప్ 1 పోస్టుల భర్తీ జరిగినది.
2011,2016,2018 ఏడాదిలలో 2145 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ జరిగింది.
2013,2016,2018 ఇయర్స్ లో 4783 గ్రూప్ 3 పోస్టుల భర్తీనకు నోటిఫికేషన్ వెలువడినది.
2011,2016,2021 లో 3006 గ్రూప్ 4 పోస్టుల భర్తీ జరిగింది.
2011,2016,2018 ఏడాదిలలో 1468 డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ జరిగింది.
2018 వ సంవత్సరంలో 237 జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ జరిగింది.
దాదాపుగా ఏపీలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 తదితర నోటిఫికెషన్స్ వచ్చి సుమారుగా 4 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలోనే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ మరియు జూనియర్, డిగ్రీ కాలేజ్ పోస్టుల భర్తీ కు వచ్చే నోటిఫికెషన్స్ కోసం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని,
ఈ తరుణంలోనే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు ను 42 నుండి 44 సంవత్సరాలకు పెంచితే, నిరుద్యోగ అభ్యర్థులకి ఎంతో లబ్ది చేకూరుతుంది అని ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడు గౌరవ చైర్మన్ గారుకు ఈ లేఖలో నిరుద్యోగ అభ్యర్థుల తరపున తెలియజేశారు.
ఏపీ లో త్వరలో చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనకు సంబందించిన, అతి కీలకమైన ఈ వయస్సు పరిమితి పెంపు గురించి వచ్చే 10 రోజులలోపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు దృష్టికి ఏపీపీఎస్సీ చైర్మన్ తీసుకుని వెళ్తారని , ఈ ప్రతీపాదనకు ఏపీ సీఎం గారు అభ్యర్థులకు అనుకూలంగానే తమ నిర్ణయం ప్రకటించనున్నారని నిరుద్యోగులు తమ తమ ఆశాభవంను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
0 Comments