Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Current Affairs 2020 | ప్రసిద్ధ భారత ఆర్థికవేత్తను వరించిన జర్మనీ శాంతి పురస్కారం

ప్రసిద్ధ భారత ఆర్థికవేత్తను వరించిన జర్మనీ శాంతి పురస్కారం :

సంక్షేమ అర్ధశాస్త్రంలో తమదైన శైలిలో కృషి చేసి, అర్ధశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియా వాసి గా  పేరొందిన అమర్త్యసేన్ ను  2020 సంవత్సరానికి గాను ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జర్మనీ శాంతి పురస్కారం వరించింది. Current Affairs 2020

భారత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ను జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారం లభించింది. 


ప్రపంచ న్యాయం, విద్యలో సామాజిక అసమానతలు, ఆరోగ్య సంరక్షణ సమస్యలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ, ఆయా సమస్యలను పరిష్కరించడానికి పలు విలువైన సూచనలు సూచిస్తూ చేస్తున్నందుకు గాను భారత ఆర్థికవేత్త అమర్త్యసేన్ కు ఈ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జర్మన్ శాంతి పురస్కారం లభించింది.

జర్మన్ శాంతి పురస్కారాన్ని 1950 వ సంవత్సరం నుండి ఇస్తున్నారు. ఈ అవార్డు ను గెలుచుకున్న గ్రహీతలకు ఈ అవార్డుతో పాటు 25, 000(ఇరవై ఐదు వేల యూరోలు ) నగదును బహుమతి గా ప్రధానం చేస్తారు.

ప్రస్తుతం అమెరికా దేశంలో ఉన్న అమర్త్యసేన్ కు  నేడు వర్చ్యువల్ విధానం ద్వారా  ఈ ప్రసిద్ధ జర్మన్ శాంతి పురస్కారాన్ని అందించారు.

కాగా 1998 వ సంవత్సరం లో మొట్టమొదటి సారిగా అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన భారతీయుడిగా అమర్త్య సేన్ గారు చరిత్ర సృష్టించారు. 

Post a Comment

0 Comments