17,900 నుండి 47,920 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి స్టాఫ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ : 21 జూలై 2021
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 05 ఆగస్టు 2021
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 05 ఆగస్టు 2021
ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించు తేదీ : 2021 సెప్టెంబర్ మొదటి వారం లో
పోస్టుల సంఖ్య:
స్టాఫ్ అసిస్టెంట్స్ విభాగంలో మొత్తం 35 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
మరియు తెలుగు భాషలో నాలెడ్జ్ కలిగి ఉండాలి. మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయసు:
20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
17,900 నుండి 47,920 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు.
చెల్లించాల్సిన ఫీజు:
SC/ST/PC/EXS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరియు జనరల్ లేదా BC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments