1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
2022-23 సంవత్సరానికి గాను భారత దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఖాళీగా ఉన్న సుమారు 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటనను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో జీతం లభించనుంది.
3). దేశంలో ఉన్న అన్ని ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ బ్యాంకు లలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
IBPS ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 23, 2021
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేది : డిసెంబర్ 26,2021
మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది : జనవరి 30, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : ఫిబ్రవరి /మార్చి 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఐటీ ఆఫీసర్స్ - 220
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ - 884
రాజభాష అధికారి - 84
లా ఆఫీసర్ - 44
హెచ్. ఆర్ /పర్సనల్ ఆఫీసర్ - 61
మార్కెటింగ్ ఆఫీసర్స్ - 535
మొత్తం పోస్టులు :
మొత్తం 1828 బ్యాంకు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ /బీ. ఈ /బీ. టెక్ /ఎంబీఏ /పీజీ /పీజీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
30 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజును మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు,సర్టిఫికెట్ వెరిఫికేషన్ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా సుమారుగా 40,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments