ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 300 అప్ప్రెంటీస్ పోస్టులు ,ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే,వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన భారత దేశ వ్యాప్తంగా ఉన్న రీఫైనరీస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 300 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ ఉద్యోగాలు.
2). ఈ అప్ప్రెంటీస్ షిప్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఉపయోగపడుతుంది.
భారీ సంఖ్యలో భర్తీ కానున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటన లో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తమిళనాడు, పుదుచ్చేరీ, కర్ణాటక, కేరళ మరియు ఇరు తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
IOCL నుండి జారీ అయిన ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. AP and TS IOCL Vacancies Telugu 2021
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేది : డిసెంబర్ 27, 2021
ఉద్యోగాలు - వివరాలు :
టెక్నికల్ - నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్ప్రెంటీస్ - 300
ప్రాంతాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
తమిళనాడు & పుదుచ్చేరి | 84 |
కర్ణాటక | 52 |
కేరళ | 49 |
ఆంధ్రప్రదేశ్ | 55 |
తెలంగాణ | 60 |
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులు /ట్రేడ్ లలో 10వ తరగతి /ఇంటర్ /ఐటీఐ / ఇంజనీరింగ్ డిప్లొమా /గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాల ఉద్యోగాలకు స్కిల్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 24 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్షలు, విద్యా అర్హతలలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
అప్ప్రెంటిస్ షిప్ రూల్స్ ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన స్టై ఫండ్స్ లభించనున్నాయి.
(APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
0 Comments