Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Hyderabad Midhani Jobs 2022 : హైదరాబాద్ మిధానిలో పేర్మినెంట్ ఉద్యోగాల భర్తీ జీతం 1,80,000

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 1,80,000 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైస్ ఆధ్వర్యంలో ఉన్న మినీ రత్న -I కంపెనీ అయిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్యంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కు చెందిన ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కలదు.

4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మిధాని సంస్థ, హైదరాబాద్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  జనవరి 1, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :  జనవరి 15, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
మేనేజ్ మెంట్ ట్రైనీ ( మెటాలార్జి ) 22
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ ) 15
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ) 6
మేనేజ్ మెంట్ ట్రైనీ (సెరామిక్ ఇంజనీరింగ్ ) 1
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ఇంజనీరింగ్ ) 1
మేనేజ్ మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్ /హెచ్. ఆర్) 4
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ ) 3
మేనేజ్ మెంట్ ట్రైనీ ( సేఫ్టీ ) 1
అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్ మెంట్ ) 3
అసిస్టెంట్ మేనేజర్ ( కార్పొరేట్ కమ్యూనికేషన్ ) 1
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ ) 1
మేనేజర్ (ఆటో మేషన్) 1
మేనేజర్ (మెకానికల్) 1

మొత్తం పోస్టులు  :

మొత్తం 61 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు ల నుండి 60% మార్కులతో మెటాలర్జీ /మెటీరియల్ సైన్స్ /మెకానికల్ /ప్రొడక్షన్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /సిరామిక్ /కెమికల్ /సివిల్ /ఇండస్ట్రీయల్ సేఫ్టీ విభాగాలలో బీఈ /బీ. టెక్, ఎంఏ /MSW/ఎంబీఏ / పీజీ డిప్లొమా /గ్రాడ్యుయేషన్ డిప్లొమా /ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

30 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ (వయసు పరిమితి సడలింపు ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ / వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతములతో పాటు డీఏ + హెచ్. ఆర్. ఏ + ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website

Notification

Apply Now

ఏ ఉద్యోగ సమాచరం కి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

Post a Comment

0 Comments