హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 1,80,000 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైస్ ఆధ్వర్యంలో ఉన్న మినీ రత్న -I కంపెనీ అయిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కు చెందిన ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కలదు.
4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మిధాని సంస్థ, హైదరాబాద్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 1, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 15, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
మేనేజ్ మెంట్ ట్రైనీ ( మెటాలార్జి ) | 22 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ ) | 15 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ) | 6 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (సెరామిక్ ఇంజనీరింగ్ ) | 1 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ఇంజనీరింగ్ ) | 1 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్ /హెచ్. ఆర్) | 4 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ ) | 3 |
మేనేజ్ మెంట్ ట్రైనీ ( సేఫ్టీ ) | 1 |
అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్ మెంట్ ) | 3 |
అసిస్టెంట్ మేనేజర్ ( కార్పొరేట్ కమ్యూనికేషన్ ) | 1 |
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ ) | 1 |
మేనేజర్ (ఆటో మేషన్) | 1 |
మేనేజర్ (మెకానికల్) | 1 |
మొత్తం పోస్టులు :
మొత్తం 61 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు ల నుండి 60% మార్కులతో మెటాలర్జీ /మెటీరియల్ సైన్స్ /మెకానికల్ /ప్రొడక్షన్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /సిరామిక్ /కెమికల్ /సివిల్ /ఇండస్ట్రీయల్ సేఫ్టీ విభాగాలలో బీఈ /బీ. టెక్, ఎంఏ /MSW/ఎంబీఏ / పీజీ డిప్లొమా /గ్రాడ్యుయేషన్ డిప్లొమా /ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
30 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ (వయసు పరిమితి సడలింపు ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతములతో పాటు డీఏ + హెచ్. ఆర్. ఏ + ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
0 Comments