గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మినీ రత్న కంపెనీ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. NHPC Jobs 2022
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాలవారు అర్హులే.
3). ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశాలు కలవు.
4). భారీ స్థాయిలో జీతభత్యాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
NHPC నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 31, 2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 21, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
జూనియర్ ఇంజనీర్ ( సివిల్ ) | 68 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ) | 34 |
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) | 31 |
మొత్తం పోస్టులు :
133 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాల వారీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా సివిల్ /ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో 60% మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను అని ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశం గలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ews / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 295 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులు /ఎక్స్ - సర్వీస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 29,600 రూపాయలు నుండి 1,19,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటు హెచ్. ఆర్. ఏ, మెడికల్ ఫెసిలిటీ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అయినటువంటి పీ. ఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ లాంటి మంచి మంచి సౌకర్యాలు కంపెనీ రూల్స్ ను అనుసరించి టైం టూ టైం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభిస్తాయి అని ప్రకటనలో తెలిపారు.
సీబీటీ పరీక్ష - ముఖ్య వివరాలు :
1).పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహించనున్నారు.
2).180 నిమిషాలు అనగా 3 గంటలు కాలవ్యవధిని ఇవ్వనున్నారు.
3).ఇంగ్లీష్ మరియు హిందీ మీడియం లలో పరీక్ష నిర్వహణ.
4).సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల సిలబస్ పై ప్రశ్నలను అడుగనున్నారు.
5).ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు పరీక్ష కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
6). నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో కలదు.
0 Comments