Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RBI 950 Assistant Jobs 2022 : మెగా నోటిఫికేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో 950 అసిస్టెంట్ ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

RBI నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచబడిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది  :   ఫిబ్రవరి 17, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :   మార్చి 8, 2022

ఆన్లైన్ పరీక్షల నిర్వహణ తేది              :  మార్చి 26&27,2022.

ఉద్యోగాలు - వివరాలు  :

అసిస్టెంట్ పోస్టులు      -       950

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భర్తీ చేయనున్న ఈ 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన విద్యా అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు ఫీజు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లై లింక్ తదితర ముఖ్యమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీతం 45,050 రూపాయలు,  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 950 ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి, డోంట్ మిస్. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అధికారిక  నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది.

ఆర్బీఐ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ గురించి, అందులో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

వెబ్సైటు లింక్ ఓపెన్ తేది                      :   ఫిబ్రవరి 17, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   ఫిబ్రవరి 17, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :  మార్చి 8, 2022

ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేది    :  మార్చి 26-27,2022

ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది   :  మే, 2022

ఉద్యోగాలు -  వివరాలు  :

అసిస్టెంట్       -       950

ప్రాంతముల వారీగా ఖాళీలు   :

అహ్మదాబాద్         -     35

బెంగళూరు             -     74

భోపాల్                   -     31

భువనేశ్వర్              -     31

చండిఘర్                -     78

చెన్నై                       -     66

గుహావాతి                 -    32

హైదరాబాద్               -    40

జైపూర్                      -    48

జమ్మూ                       -   12

కాన్పుర్ & లక్నో           - 131

కోల్ కత్తా                      -   26

ముంబై                         - 128

నాగ్ పూర్                     -   56

న్యూఢిల్లీ                        -   75

పాట్న                              -  33

తిరువనంతపురం & కొచ్చి - 54

మొత్తం పోస్టులు   :

950 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి ఏదైనా విభాగంలో 50% మార్కులతో బ్యాచ్ లర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు లోకల్ లాంగ్వేజ్ పై పట్టు ఉండి, కంప్యూటర్ వర్డ్ పై నాలెడ్జి కలిగి ఉండవలెను అని ప్రకటన ద్వారా తెలిపారు.

వయసు :

20-28 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఓబీసీ /జనరల్ /ews కేటగిరి అభ్యర్థులు 450 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 50 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు :

ఆన్లైన్ విధానంలో ప్రిలిమ్స్  మరియు మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 20,700 రూపాయలు నుండి 45,050 రూపాయలు వరకూ జీతం అందనుంది.

పరీక్షల సిలబస్ - వివరాలు   :

ప్రిలిమ్స్ పరీక్ష (ఆన్లైన్ )  :

1). మల్టీ పుల్ ఛాయస్ లో 100 ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించారు.

2). 60 నిమిషాల సమయమును ఇవ్వనున్నారు.

సిలబస్ - మార్కులు :

ఇంగ్లీష్                            -   30 మార్కులు.

న్యూమరికల్ ఎబిలిటీ    -   35 మార్కులు.

రీసనింగ్ ఎబిలిటీ           -   35 మార్కులు.

మెయిన్స్ పరీక్ష ( ఆన్లైన్ )  :

1). మల్టీ పుల్ ఛాయస్ లో 200 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు.

2). 135 నిమిషాల సమయం ఇవ్వనున్నారు.

సిలబస్   -  మార్కులు  :

టెస్ట్ ఆఫ్ రీసనింగ్                          -      40 మార్కులు 

టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్           -     40 మార్కులు 

టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ     -     40 మార్కులు 

టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్           -    40  మార్కులు 

టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్         -    40  మార్కులు

పరీక్ష కేంద్రాలు - నగరాలు :

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న నగరాలు :

చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

Website

Notification

Full Notification

Post a Comment

0 Comments