సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - డిసెంబర్ 2021 ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా ఒక ప్రకటనను జారీ చేసినది.
సీటెట్ - 2021 ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను తమ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకి అందుబాటులో ఉంచినట్లుగా తాజాగా జారీ చేసిన ఈ ప్రకటనలో సీబీఎస్ఈ తెలిపింది.
2021 డిసెంబర్ నెలలో నిర్వహించిన ఈ కేంద్రియ ఉపాధ్యాయ అర్హతల పరీక్ష పేపర్ - I కు మొత్తం 14,95,511 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 4,45,467 మంది అభ్యర్థులు ఉత్తిర్ణత చెందారని, CTET 2021 Result Update
మరియు పేపర్ - II పరీక్షలకు 12,78,165 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,20,069 మంది అభ్యర్థులు ఈ పరీక్షలలో క్వాలిఫై అయినట్లుగా CBSE ఈ ప్రకటన ద్వారా పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ను క్లిక్ చేసి మీ మీ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చును.
0 Comments