గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). ఈ పోస్టులను రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈఎస్ఐసీ లో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 12, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ /మేనేజర్ గ్రేడ్ -II/సూపరింటెండెంట్ - 93.
విభాగాల వారీగా ఖాళీలు :
యూఆర్ - 43
ఎస్సీ - 9
ఎస్టీ - 8
ఓబీసీ - 24
Ews - 9
మొత్తం పోస్టులు :
93 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు,గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత విభాగాలలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండవలెను.కామర్స్ /లా /మేనేజ్మెంట్ విభాగాలలో గ్రాడ్యుయేట్స్ అయినవారికి ప్రాధాన్యత ఇవ్వబడును అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కంప్యూటర్ ఆఫీస్ సూట్స్ మరియు డేటా బేస్ తదితర విభాగాలలో నాలెడ్జ్ మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులకు తెలుపుతున్నారు.
వయసు :
21-27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /యూఆర్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ/ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ & డిస్క్రిప్టివ్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
సిలబస్ - వివరాలు :
ఈ పరీక్షలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీసనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంటలిజెన్స్,జనరల్ఎకానమీ,ఫైనాన్సియల్,ఇన్సూరెన్స్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ తదితర అంశాలపై అభ్యర్థులను ప్రశ్నలను అడుగనున్నారు.
ప్రిలిమ్స్ పరీక్షను 100 మార్కులకు 60 నిమిషాల కాలవ్యవధి తో, మెయిన్స్ పరీక్షను 200 మార్కులకు 2 గంటల కాలవ్యవధితో, కంప్యూటర్ మరియు డిస్క్రిప్టివ్ పరీక్షలను ఒక్కొక్క పరీక్షకు 50 మార్కులకు గానూ 30 నిమిషాల కాలవ్యవధితో నిర్వహించనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 44,900 - 1,42,400 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments