గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ, రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
రైల్ టెల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Railtel Jobs Update in Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 4, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్/డిప్లొమా ఇంజనీర్స్ - 103
మొత్తం పోస్టులు :
103 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ /టెలి కమ్యూనికేషన్స్/కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /సివిల్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో ఫుల్ టైమ్ రెగ్యులర్ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ /టెక్నాలజీ/మూడు సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ /టెక్నాలజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 - 14,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.
0 Comments