Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SSC MTS 3500 Jobs : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS ఉద్యోగాలు, పదోతరగతి తో ఉద్యోగాలు, జీతం 20,200

భారత దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయాలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన గ్రూప్ - సీ నాన్ - గేజిటెడ్, నాన్ - మినిస్ట్రీయల్ పోస్టులు.

2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో పోస్టుల భర్తీ.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

4). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

5). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్  మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన వారు విశాఖపట్నం మరియు హైదరాబాద్ నగరాలలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు.

ఎస్ఎస్సీ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది                 :   మార్చి 22, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది                         :   ఏప్రిల్ 30, 2022

ఆన్లైన్ లో ఫీజుల చెల్లింపుకు చివరి తేది            :   మే 2 , 2022

చలానా ఫీజులు చెల్లింపులకు చివరితేది           :    మే 5, 2022

ఆన్లైన్ సీబీటీ పేపర్ - 1 పరీక్ష నిర్వహణ తేది    :  జూలై, 2022

పేపర్ - II ( డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహణ తేది    : ఇంకా ప్రకటించలేదు.

విభాగాల వారీగా ఖాళీలు  :

మల్టి టాస్కింగ్ సిబ్బంది    -  3603

తెలుగు రాష్ట్రాలలో హవాల్దార్  ఖాళీలు  :

హైదరాబాద్       -    152

విశాఖపట్నం     -    38

మొత్తం ఉద్యోగాలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 3600కు పైగా  సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీని చేయనున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాలలో అయితే 190 హవాల్దార్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /స్కూల్ నుండి 10వ తరగతి /మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేయవలెను. నిర్థిష్ట శారీరక ప్రమాణాలు అవసరం అని ప్రకటనలో తెలిపారు.

వయసు :

18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు విభాగాలను అనుసరించి      ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

మహిళలు, మాజీ సైనికులు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(CBE), ఫీజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎక్సమినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

సిలబస్ - వివరాలు  :

పేపర్ - 1 పరీక్షలలో జనరల్ ఇంగ్లీష్ , జనరల్ ఇంటలిజెన్స్ & రీసనింగ్  మరియు న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలపై ప్రశ్నలను అడుగనున్నారు.

మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలుగా ఉంది.

పేపర్ - 2 లో భాగంగా షార్ట్ ఎస్సయ్ అండ్ లెటర్  ఇన్ ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో అభ్యర్థులు వ్రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించగా, కాలవ్యవధి 45 నిముషాలుగా ఉంది.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th పే కమిషన్ ను అనుసరించి ఆకర్షనీయమైన జీతం  లభించనుంది.

తెలుగు రాష్ట్రాలల్లో కేటాయించబడిన పరీక్ష కేంద్రాలు :

ఆంధ్రప్రదేశ్ :

చీరాల , గుంటూరు,కాకినాడ, కర్నూల్,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణ :

కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్.

Website

Notification

Apply Link

Post a Comment

0 Comments