ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 1000కీ పైగా పోస్టుల
భర్తీకి మెగా స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది.
ముఖ్యాంశాలు :
1). ఈ మెగా జాబ్ మేళాను ఏపీఎస్ఎస్డిసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). 10th అర్హతలుతో కూడా ఉద్యోగాల భర్తీ.
4). ఆకర్షణీయమైన జీతములు.
ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు, శ్రీ సిటీ, నాయుడు పేట, చిత్తూరు జిల్లా, చెన్నై మరియు తిరుపతి ఎయిర్ పోర్ట్ సమీపంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి లో తాజాగా నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది : మార్చి 28, 2022
జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
జాబ్ డ్రైవ్ - నిర్వహణ ప్రదేశం :
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తిరుపతి - తిరుత్తని రోడ్, మండపం దగ్గర, నగరి, చిత్తూరు జిల్లా - 517590.
జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు :
అమర్ రాజా గ్రూప్
భారత్ ఎఫ్.ఐ.హెచ్. లిమిటెడ్
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ (ఇండియా ) ప్రయివేట్ లిమిటెడ్
అపోలో ఫార్మసీ
డిజి టెక్నాలజీ సర్వీసెస్
డీక్సన్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్
విభాగాల వారీగా ఖాళీలు :
మెషిన్ ఆపరేటర్ - 300
అసెంబ్లీ లైన్ ఆపరేటర్ - 200
ట్రైనీ ఆపరేటర్ - 250
ఫార్మసీస్ట్ - 050
ఫార్మసీ ట్రైనీస్ - 050
కస్టమర్ సర్వీస్ రిప్రెసేంటేటివ్ - 70
లైన్ ఆపరేటర్స్/లైన్ ఇంచార్జెస్/క్వాలిటీ ఇంజనీర్/స్టోర్ ఆపరేటర్ - 100
మొత్తం ఉద్యోగాలు :
1020 ఉద్యోగాలను ఈ మెగా జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి(పాస్ /ఫెయిల్ ), ఇంటర్మీడియట్ (పాస్ /ఫెయిల్ ), ఐటీఐ (పాస్ /ఫెయిల్ ) /డిగ్రీ (పాస్ /ఫెయిల్ ) /డిప్లొమా/ఎంఫార్మసీ/డీఫార్మసీ/బీ. టెక్ తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.
వయసు :
18 నుండి 29 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ కేటగిరిలా వారీగా ఈ పోస్టులకి అర్హులే అనీ ప్రకటనలో తెలుపుతున్నారు
ఎలా అప్లై చేసుకోవాలి..?
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.
ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.
ఈ పోస్టుల జాబ్ మేళలకు హాజరు కాబోయే అభ్యర్థులు రెస్యూమ్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని పొందుపరిచారు.
అభ్యర్థులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
6300954441
7989509540
9988853335
0 Comments