ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు, జీతం 3,21,289 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, అస్సలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). రెగ్యులర్ /కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
4). బ్యాక్ లాగ్ వేకెన్సీలను కూడా కలిపి భర్తీ చేస్తున్నారు.
5). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
మరియు ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. Indian Post payment Bank Jobs 2022
ఐపీపీబీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మార్చి 26, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 9, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నాలజీ :
| పొస్ట్ లు | ఖాళీలు | 
|---|---|
| చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ | 1 | 
| ఏజీఎం | 1 | 
| చీఫ్ మేనేజర్ | 1 | 
| సీనియర్ మేనేజర్ | 1 | 
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ :
| పొస్ట్ లు | ఖాళీలు | 
|---|---|
| సీనియర్ మేనేజర్ | 1 | 
| మేనేజర్ | 1 | 
ప్రొడక్ట్స్ :
| పొస్ట్ లు | ఖాళీలు | 
|---|---|
| ఏజీఎం - బీఎస్జీ | 1 | 
| చీఫ్ మేనేజర్ | 1 | 
| చీఫ్ మేనేజర్ | 1 | 
ఆపరేషన్స్ :
| పొస్ట్ లు | ఖాళీలు | 
|---|---|
| జీఎం | 1 | 
కంప్లెయిన్స్ ఫంక్షన్ :
| పొస్ట్ లు | ఖాళీలు | 
|---|---|
| చీఫ్ కంప్లెయిన్స్ ఆఫీసర్ | 1 | 
| చీఫ్ మేనేజర్ | 1 | 
మొత్తం పోస్టులు :
12 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ /ఎంసీఏ/బాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ /బాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ /ఎంసీఏ/బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బీటెక్ /బీఈ - ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ /ఎంబీఏ ఇన్ సేల్స్ / మార్కెటింగ్ /ఎనీ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఫైనల్) క్వాలిఫైడ్ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీలను అనుసరించి 23 నుండి 55 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు పైన వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలను మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 150 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు :
ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్ /ఆన్లైన్ టెస్ట్ ల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 1,04,163 రూపాయలు నుండి 3,21,289 రూపాయలు వరకూ జీతం అందనుంది.

0 Comments