గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్. బీ. బీ.సీ (ఇండియా ) లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై కు అర్హులే.
3). రెగ్యులర్ బేసిస్ లో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎన్బీబీసీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 6, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 5, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ) - 25
మొత్తం పోస్టులు :
25 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా సమాన విద్యా అర్హతలు కలిగిన వారందరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
41 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు , 3 సంవత్సరాలు వయసు పరిమితి ఉండే అవకాశం గలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు అని ప్రకటనలో తెలిపారు.
ఎలా ఎంపిక చేస్తారు..?
పర్సనల్ ఇంటర్వ్యూ /ఇతర ఎంపిక విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70,000 రూపాయలు నుండి 2,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments