దేశీయ తొలి యాంటీ - రేడియన్ క్షిపణి రుద్రం ప్రయోగం విజయవంతం అయింది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ { DRDO} దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ తొలి యాంటీ -రేడియన్ క్షిపణి రుద్రం ప్రయోగాన్ని ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ లో సుఖోయ్ -30 యుద్ధ విమానం నుండి పరీక్షించారు.
గగన తలం నుండి భూ ఉపరితలానికి ప్రయోగించిన ఈ రుద్రం క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి అవ్వడంతో శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శత్రు దేశాల నిఘా రాడార్లు,, సమాచార వ్యవస్థలను ద్వంసం చేయగల ఈ రుద్రం క్షిపణిని ఎత్తైన ప్రాంతాల నుండి ప్రయోగించవచ్చును.
భారత యుద్ధ విమానాలు మిరాజ్, జాగ్వార్, తేజస్ వంటి వాటిపై నుంచి " రుద్రం " క్షిపణిని ప్రయోగించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.
INS మరియు GPS నావిగేషన్ వ్యవస్థలను ఈ రుద్రం క్షిపణి లో అమర్చడం గమనార్హం.
ఈ ప్రయోగ విజయంతో భారత రక్షణ రంగానికి అదనపు బలం చేకూరినట్లుగా తెలుస్తుంది.
0 Comments