ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోబెల్ అవార్డు ను 2020 వ సంవత్సరానికి గాను శాంతి రంగంలో నేడు ప్రకటించారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి -2020 అవార్డును ప్రపంచ ఆహార కార్యక్రమం ( WORLD FOOD PROGRAMME ) దక్కించుకుంది.
ఆకలిని ఎదుర్కొనేందుకు సంక్షోభ ప్రాంతాల్లో శాంతి మరియు మెరుగైన పరిస్థితుల కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తున్నందుకు గాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసారు.
గత ఏడాది సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సుమారుగా 88 దేశాల్లో 10 కోట్లమంది ప్రజలకు ప్రపంచ ఆహార సంస్థ తమ అద్వితీయమైన సహాయాన్ని అందించింది.
ప్రపంచ ఆహార సంస్థను 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడంతో ప్రపంచ ఆహార సంస్థ చీఫ్ డోనాల్డ్ బియాస్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
నార్వే రాజధాని ఓస్లో నగరంలో డిసెంబర్ 10వ తారీఖున ప్రపంచ ఆహారసంస్థ నోబెల్ శాంతి బహుమతి -2020 అవార్డును అందుకోనుంది.
ఈ సందర్భంగా ప్రపంచ ఆహార సంస్థకు అవార్డు మరియు 1.1 మిలియన్ డాలర్ల ఆర్థిక బహుమతి లభించనుంది.
ప్రపంచ వ్యాప్తంగా 211మంది ప్రముఖులు మరియు 107 సంస్థలు ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కాగా,, ప్రపంచ ఆహార సంస్థ (world food Programme) కు నోబెల్ శాంతి అవార్డు -2020 లభించడం విశేషం.
6 రంగాల్లో 5 రంగాలు అనగా.. సాహిత్యం, వైద్యం,భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థ శాస్త్రాలలో అవార్డులను స్వీడన్ రాజధాని స్టాక్ హోం లో ప్రధానం చేస్తుండగా, శాంతి రంగం లో మాత్రం నోబెల్ బహుమతిని నార్వే రాజధాని ఓస్లో లో ప్రధానం చేయడం నోబెల్ శాంతి బహుమతుల యొక్క ప్రత్యేకత.
రాబోయే రోజుల్లో జరిగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పోటీ పరీక్షలలో ఖచ్చితముగా నోబెల్ అవార్డులు -2020 గురించి బిట్స్ అడుగుతారు. కావున విద్యార్థులు నోబెల్ అవార్డులు -2020 అంశంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని తెలుపుతున్నాము.
0 Comments