2020 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో నోబెల్ అవార్డు లను రాయల్ స్వీడిష్ అకాడమీ వారు నేడు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో జరిగే అన్ని కేంద్రప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నోబెల్ అవార్డులు -2020 కి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఈ విషయాలను తప్పనిసరిగా జ్ఞప్తి లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోబెల్ అవార్డులు 2020 - భౌతిక శాస్త్రం :
కృష్ణ బిలాలపై పరిశోధనలు చేసి,
కృష్ణబిలాల గుట్టును ఈ సువిశాల విశ్వానికి తెలియచేసినందుకు గాను ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు రోజర్ పెన్ రోస్, రిన్ హార్డ్ గెంజల్ మరియు ఆండ్రియా ఘోజ్ లు భౌతిక శాస్త్ర విభాగంలో 2020 సంవత్సరానికి గాను ఈసారి నోబెల్ అవార్డులను గెలుచుకున్నారు.
నోబెల్ అవార్డులు 2020 - రసాయన శాస్త్రం :
జినోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మానుయేల్ చార్ పెంటియర్ మరియు జెన్నిఫర్ ఏ దౌడ్న లను ఈసారి 2020 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు లకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేసింది.
0 Comments