గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన కరెన్సీ నోట్ ప్రెస్, నాశిక్ రోడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). రెగ్యులర్ ఉద్యోగాలుగా పరిగణించవచ్చు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థలో భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో తెలుపడం జరిగింది. Currency Note Press 2022 Jobs telugu
ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాల భర్తీ విధి - విధానాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 4, 2022
దరఖాస్తులకు చివరి తేది : జనవరి 25,2022
ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది : ఫిబ్రవరి/మార్చి, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
వెల్ఫేర్ ఆఫీసర్స్ (లెవెల్ -A-2) | 1 |
సూపర్ వైజర్స్ (టెక్నికల్ కంట్రోల్ ) | 10 |
సూపర్ వైజర్స్ (టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్ ) | 5 |
సూపర్ వైజర్స్ (ఆఫీషియల్ లాంగ్వేజ్) | 1 |
సెక్రటరీయల్ అసిస్టెంట్ (లేవెల్ B-4) | 1 |
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (లెవెల్ -B-3) | 6 |
జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ కంట్రోల్) | 104 |
జూనియర్ టెక్నీషియన్ (వర్క్ షాప్) | 21 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 149 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో ఐటీఐ /డిగ్రీ /డిప్లొమా /బీ. ఈ /బీ. ఎస్సీ మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు కొన్ని విభాగాల ఉద్యోగాలకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ/ews కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
కేటగిరీ లను అనుసరించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ /స్టేనోగ్రఫీ /టైపింగ్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాల వారీగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,780 రూపాయలు నుండి 1,03,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments