ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో వివిధ విభాగాలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఏపీ లో సుమారుగా ఒక లక్ష మందికి పైగా ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు తమ ఉద్యోగాల పేర్మినెంట్ మరియు జీతముల పెంపు గురించి చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు ఈ అంశంపై ఒక కీలకమైన ప్రకటనను చేశారు.
ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో ఉద్యోగాల బాధ్యతలను నిర్వహిస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగార్థులకు జూన్ 30 వ తేది నాటికీ ప్రోబేషన్ ను పూర్తి చేయాలని,
మరియు జూలై 1, 2022 నుండి కొత్త పే స్కేల్ ను అనుసరించి నూతన జీతములను అందించాలని, అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తాజాగా ఆదేశించారు. Grama Sachivalayam Salary 2022
ఇప్పటి వరకూ కూడా ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేయడానికి నిర్వహించిన పరీక్షలలో క్వాలిఫై కానీ అభ్యర్థుల కోసం మరోసారి మార్చి నెల మొదటి వారంలో పరీక్షలను నిర్వహించాలని అధికారులకూ ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకూ డైలామా లో ఉన్న ఈ అంశంపై స్వయానా ఏపీ సీఎం గారు చేసిన ఈ ముఖ్యమైన ప్రకటన ద్వారా ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో ఉద్యోగాల బాధ్యతలు నిర్వహిస్తున్న అభ్యర్థులు జూలై 1 నుండి కొత్త జీతములు అందుకోనున్నట్లు తెలుస్తుంది.
రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here
0 Comments