ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చింది.
గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో పని చేస్తున్న ఉద్యోగస్తులందరికి ఏపీ నూతన మరియు పునరుద్దరనీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ తరుపున ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఈ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికి ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను అందిస్తుండగా, ఇప్పుడు వీటిని గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులందరికి కూడా ఇవ్వనుండడం గమనార్హం. Grama Ward Sachivalayam Update 2022
ఈ వాహనాలు కొనుగోలుకు అయ్యే మొత్తంను ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయం ఉద్యోగస్తులు ప్రతీ నెల తమ తమ జీతం నుండి వాయిదా పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటుంది అని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని ఏపీ గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక ముఖ్యమైన ప్రకటనలో తెలిపారు.
0 Comments