ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముఖ్యమైన నగరాలుగా పిలిచే రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో గల ప్రముఖ తిరుమల విద్యా సంస్థ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది..
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరగనుంది.
ఎంపికైన అభ్యర్థులకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ ఇంటర్వ్యూలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు. ఈ ఇంటర్వ్యూ లకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు : ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
ఏప్రిల్ 16లేదా17, ఏప్రిల్ 23 లేదా 24, ఏప్రిల్ 30 లేదా మే 1.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం :
ఉదయం 9 గంటల నుండి - మధ్యాహ్నం 2 గంటల వరకూ.
తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
ఏప్రిల్ 16 లేదా 17, 2022 - రాజమహేంద్రవరం
ఏప్రిల్ 23 లేదా 24, 2022 - రాజుల తల్లవలస, విశాఖపట్నం
ఏప్రిల్ 30 లేదా మే 1, 2022 - భీమవరం
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ లెక్చరర్స్ ఫర్ జెఈఈ (అడ్వాన్స్ ) :
మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవలజీ విభాగాలలో సీనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సీనియర్ లెక్చరర్స్ ఫర్ జేఈఈ ( మెయిన్స్ ) :
ఫాకల్టీ ఫర్ ఐఐటీ/ఒలింపియాడ్ ( 6వ తరగతి - 10 వ తరగతి ) :
మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగాలలో పై పోస్టులను భర్తీ చేయనున్నారు.
జూనియర్ లెక్చరర్స్ ఫర్ ఎంసెట్ అండ్ ఐపీఈ :
మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవలజీ, ఇంగ్లీష్, సంస్కృతం సబ్జెక్టు విభాగాలలో జూనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
హై స్కూల్ టీచర్స్ ( 6వ తరగతి - 10వ తరగతి ) :
ప్రైమరీ స్కూల్ టీచర్స్ ( ఎల్. కే. జీ - 5వ తరగతి ) :
అన్ని సబ్జెక్టు ల వారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
టీచర్ కమ్ వార్డెన్స్
వార్డెన్ కమ్ అసిస్టెంట్ టీచర్స్
అసిస్టెంట్ టీచర్స్
కో - ఆర్డినేటర్స్
ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్
రిసెప్షనిస్ట్స్
కంప్యూటర్ ఆపరేటర్స్
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ మరియు డెమో ల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
జెఈఈ అడ్వాన్స్ /మెయిన్స్ / నీట్ విభాగాలకు సంబంధించిన లెక్చరర్స్ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 75,000 - 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 నుండి 50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
మిగిలిన నాన్ - టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 నుండి 20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
రాజమహేంద్రవరం :
79970 71672
83090 76048
విశాఖపట్నం :
84639 33335
94943 26051
భీమవరం :
91826 23317
98853 50289
మరిన్ని ఉద్యోగాలు Click Here
0 Comments