విద్యుత్ శాఖ లో పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక మంచి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది.ఈ యొక్క ఉద్యోగాలకు 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం జరుగుతుంది.
ట్రైనింగ్ పిరియడ్ లో50,000/-రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.సొంత రాష్ట్రం లోనే ఉద్యోగం పొందవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1). ఇవి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఎలాంటి వ్రాత పరీక్ష లేదు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అర్హులే.
5). ఎటువంటి అనుభవం అవసరం లేదు.
6). ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
7). ఎటువంటి ఇంటర్వ్యూ లు లేవు.
ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చెసుకొవచ్చు.
అదే విధంగా అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు. THDC Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకోవడానికి ప్రారంభ తేది : 01 జులై 2022.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేది : 01 ఆగస్టు 2022
ఫీజు చెల్లించుటకు చివరి తేది : 03 ఆగస్టు 2022
పోస్టు యొక్క పేరు:
ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు :
టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల అయిన ఈ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలు అనేవి మొత్తం 45 పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు :
ఇంజనీరింగ్ ట్రైనీ సివిల్ విభాగంలో మొత్తం 20 పోస్టులు కలవు.
ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 15 పోస్టులు కలవు.
ఇంజనీరింగ్ ట్రైనీ మెకానికల్ విభాగంలో మొత్తం 10 పోస్టులు కలవు.
మొత్తం 45 ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది.
ఆర్హతలు:
ఈ ఇంజనీరింగ్ ట్రైనీ సివిల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా సివిల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ పద్దతి లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ 65% మార్కుల తో పూర్తి చేసి ఉండాలి.
ఈ ఇంజనీరింగ్ ట్రైనీ మెకానికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ / మెకానికల్ & ఆటోమేషన్ ఇంజనీరింగ్ రెగ్యులర్ పద్దతి లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ 65% మార్కుల తో పూర్తి చేసి ఉండాలి.
ఈ ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో గల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఎలక్ట్రికల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ రెగ్యులర్ పద్దతి లో 65% మార్కుల తో పూర్తి చేసి ఉండాలి.
వయసు వివరాలు:
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు12 నెలల ట్రైనింగ్ పిరియడ్ లో నెలకు 50,000/- రూపాయలు మరియు ట్రైనింగ్ పూర్తి అయ్యాక 1,00,000/- రూపాయల వరకూ ఆకర్షనీయమైన వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ మరియు ఓబీసి మరియు ఇ.డబ్ల్యూ ఎస్ కేటాగిరి అభ్యర్థులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు 600/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
అదే విధంగా ఎస్టీ/ఎస్సి/పి.డబ్ల్యూ.డి.ఎస్ మరియు ఎక్స్ - సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఫీజు చెల్లించవలసిన విధానం:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానం లో ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.
0 Comments