ఏపీ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుకున్నటువంటి 80% మంది విద్యార్థుల యొక్క కోరిక ఈరోజు నెరవేరడం జరిగింది. ఏపీ డీఎస్సీ పరీక్ష అదేవిధంగా ఏపీ TET కి సంబంధించిన ఫలితాలు ఎలక్షన్ తర్వాత నిర్వహించమని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున డీఎస్సీను వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు డీఎస్సీ ని వాయిదా వేయాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఏపీ టెట్ ఫలితాలు విడుదల కూడా ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎన్నికల వరకు TET ఫలితాలను సైతం వాయిదా వేయాలని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఫలితాలను కూడా హైకోర్టు ఆదేశాల మేరకు వెల్లడించవచ్చునని ఆదేశించింది.
ఈ మేరకు ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లకు ఇచ్చినటువంటి ఫోన్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
0 Comments