గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 ఉద్యోగాలు.
2). వీటిని రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
4). భారీ స్థాయిలో జీతములు.
ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వచ్చిన ఈ ముఖ్యమైన ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 15, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 23, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ - 1 కేటగిరీ :
డిప్యూటీ మేనేజర్ ( టెక్నీషియన్ ) - 24
డిప్యూటీ మేనేజర్ ( ఎలక్ట్రికల్ ) - 1
డిప్యూటీ మేనేజర్ ( సివిల్ ) - 1
డిప్యూటీ మేనేజర్ ( మార్కెటింగ్ ) - 6
డిప్యూటీ మేనేజర్ ( ఫైనాన్స్ ) - 4
డిప్యూటీ మేనేజర్ ( లీగల్ ) - 1
గ్రూప్ - 2 కేటగిరీ :
డిప్యూటీ మేనేజర్ ( డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ ) - 2
మేనేజర్ ( డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ ) - 2
సీనియర్ మేనేజర్ ( డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ ) - 2
డిప్యూటీ మేనేజర్ (సిస్టం అడ్మినిస్ట్రేషన్ ) - 6
మేనేజర్ ( సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ) - 2
సీనియర్ మేనేజర్ ( సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ) - 2
డిప్యూటీ మేనేజర్ ( సెక్యూరిటీ ) - 4
మేనేజర్ ( సెక్యూరిటీ ) - 2
సీనియర్ మేనేజర్ ( సెక్యూరిటీ ) - 2
డిప్యూటీ మేనేజర్ ( నెట్ వర్క్ ) - 3
మేనేజర్ ( డెవోప్స్ ) - 3
మేనేజర్ ( ఐటీ ) - 1
సీనియర్ మేనేజర్ ( ఐటీ ) - 1
మొత్తం పోస్టులు :
69 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీ.ఈ / బీ. టెక్ /బీ. ఎస్సీ (ఇంజనీరింగ్ ) / ఎంబీఏ /పీజీ డిప్లొమా /సీఏ/ఫుల్ టైమ్ ఎల్. ఎల్. బీ / ఎంసీఏ / ఎం. ఎస్సీ మొదలైన కోర్సు లను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి కనిష్ఠముగా 21 సంవత్సరాలు మరియు గరిష్టముగా 34 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ రైల్వే శాఖకు చెందిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఆయా కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1200 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 600 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments