ప్రముఖ భారతీయ కమర్షియల్ బ్యాంక్ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
సౌత్ ఇండియన్ బ్యాంక్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని తెలుపుతున్నారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు మరియు భారతదేశంలోని ముఖ్య నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 5, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 11, 2022
ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది : ఫిబ్రవరి, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రోబేషనరీ ఆఫీసర్స్
ప్రొబేషనరీ క్లర్క్స్
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు ల నుండి 60% మార్కులతో రెగ్యులర్ విధానంలో 10వ తరగతి /ఎస్ఎస్ఎల్సీ/ఇంటర్/హెచ్. ఎస్. సీ /గ్రాడ్యుయేషన్(ఆర్ట్స్ /సైన్స్ /కామర్స్ /ఇంజనీరింగ్ స్ట్రీమ్ ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
26 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో మాత్రమే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
రీసనింగ్ /కంప్యూటర్ అప్టిట్యూడ్ /జనరల్ /ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్నెస్ /ఇంగ్లీష్ లాంగ్వేజ్ /డేటా ఎనాలిసిస్ & ఇంటర్ ప్రిటేషన్ తదితర అంశాలపై ఈ పరీక్షల్లో ప్రశ్నలను అడగనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 17,900 రూపాయలు నుండి 63,840 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రముల ఎంపిక :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న క్రింది నగరాలను పరీక్ష కేంద్రములుగా ఎంపిక చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దయచేసి మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి. మళ్ళీ మీకు 11 వ తేదిన ఎలా అప్లై చేసుకోవాలో చెబుతాను.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments