ప్రముఖ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటన బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై నుండి తాజాగా విడుదల అయినది
ముఖ్యాంశాలు :
1). ఈ ఉద్యోగాలను రెగ్యులర్ మరియు కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
2).భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ కానున్నాయి.
3). భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి.
ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో పొందుపరిచిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 26, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 10, 2022
ఏజ్ మరియు విద్యార్హతలకు కట్ ఆఫ్ తేది : డిసెంబర్ 1, 2021
ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ తేది : త్వరలో ప్రకటించబడును.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
రెగ్యులర్ బేసిస్ :
ఎకనామిస్ట్ - 2
స్టాటిస్టిషియన్ - 2
రిస్క్ మేనేజర్ - 2
క్రెడిట్ ఎనాలిస్ట్ - 53
క్రెడిట్ ఆఫీసర్స్ - 484
టెక్ అప్రైసల్ - 9
ఐటీ ఆఫీసర్ డేటా సెంటర్ - 42
కాంట్రాక్టు బేసిస్ :
మేనేజర్ ఐటీ - 21, సీనియర్ మేనేజర్ ఐటీ-23,మేనేజర్ ఐటీ (డేటా సెంటర్) - 6,సీనియర్ మేనేజర్ ఐటీ (డేటా సెంటర్ ) -6,సీనియర్ మేనేజర్ (నెట్ వర్క్ సెక్యూరిటీ) - 5,సీనియర్ మేనేజర్ ( నెట్ వర్క్ రూటింగ్)- 10,మేనేజర్ (ఎండ్ పాయింట్ సెక్యూరిటీ)-3,మేనేజర్ ( డేటా సెంటర్ సిస్టమ్ )-6,మేనేజర్ ( అడ్మినిస్ట్రేటర్ విండోస్ )-3,మేనేజర్ ( డేటా సెంటర్ క్లౌడ్ )- 3,మేనేజర్ ( డేటా సెంటర్ స్టోరేజ్ )-3,మేనేజర్ ( డేటా సెంటర్ నెట్ వర్క్ )-4, మేనేజర్ ( డేటా సెంటర్ ఎక్స్ పర్ట్ )- 5 మేనేజర్ ( టెక్నాలజీ ఆర్చిటెక్ట్ )- 2, మేనేజర్ ( అప్లికేషన్ ఆర్చిటెక్ట్ )- 2
మొత్తం ఉద్యోగాలు :
696 బ్యాంక్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిగ్రీ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా /ఎంబీఏ /పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీబీఎం/పీజీడీబీఏ/సీఎస్ / ఐటీ తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
28 సంవత్సరాలు నుండి 37 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ టెస్ట్ / గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష - పూర్తి వివరాలు :
ఈ ఆన్లైన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలపై ప్రశ్నలను అభ్యర్థులకు పరీక్ష పత్రంలో ఇవ్వనున్నారు. మొత్తం పరీక్ష 175 మార్కులకు నిర్వహించనున్నారు. పరీక్ష కాలవ్యవధి 150 నిముషాలుగా ఉంది.
జీతం :
కేటగిరీల వారీగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 89,890 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సరికొత్తగా SBI జాబ్స్ మిస్ కాకండి. Click Here
0 Comments