ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా విడుదల చేసింది.
ఏపీ లో గడిచిన ఏడాది నవంబర్ 2021 లో వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్ 11/2021 ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
తాజాగా, ఈ అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన వ్రాత పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.
ఈ ప్రకటన ప్రకారం అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎగ్జామ్స్ తేదీల షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.
అసిస్టెంట్ ఇంజనీర్స్ - పరీక్షల షెడ్యూల్ :
పరీక్షల నిర్వహణ తేదీలు : మే 14, 2022 - మే 15, 2022.
మే 14, 2022 :
( షిఫ్ట్ 1 సమయం : 9 AM to 12 PM)
పేపర్ 3 : ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ / సివిల్ (కామన్ ).
మే 15, 2022 :
( షిఫ్ట్ 1 సమయం : 9 AM to 12 PM )
పేపర్ 1 : జిఎస్ఎంఏ.
మే 16, 2022 :
( షిఫ్ట్ 2 సమయం : 2 PM to 5 PM)
పేపర్ 2 : సివిల్ / మెకానికల్.
హాల్ టికెట్స్ విడుదల తేది :
పరీక్షలకు ఒక వారం రోజుల ముందు హాల్ టికెట్స్ ను అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జనవరి 27, 2021 న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 190 అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఈ పోస్టులకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులనుండి దరఖాస్తులు రావడంతో దీనితో అభ్యర్థులు తాము పరీక్షలు వ్రాయడానికి వీలుగా నోటిఫికేషన్ లో పొందుపరిచిన పరీక్ష కేంద్రముల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష కేంద్రంలో హైదరాబాద్ నగరాన్ని కూడా పొందుపరిచారు.
జనవరి 27వ తేదీన ఈ లింక్ ను ఏపీపిఎస్సీ వెబ్సైటు లో పొందుపరిచనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తేది లోపు లో తమ తమ పరీక్ష కేంద్రముల నగరాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ విధానంలో అభ్యర్థులకి టెస్ట్ సెంటర్స్ ను కేటాయించనున్నారు.
ఏపి లో 730 ప్రభుత్వ ఉద్యోగాలు 49,870 వరకు జీతం Click Here
0 Comments